నిరుపేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-03-31T00:14:14+05:30 IST

నిరుపేదలకు అండగా ప్రభుత్వం నిలుస్తుందని జడ్పీవైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు పేర్కొన్నారు. మండలంలోని ఒగులాపూర్‌ గ్రామానికి చెందిన సత్తయ్యకు గురువారం సీఎం సహాయనిధి చెక్కును అందించారు.

నిరుపేదలకు అండగా రాష్ట్ర  ప్రభుత్వం
చెక్కును అందిస్తున్న జడ్పీవైస్‌ చైర్మన్‌

జడ్పీవైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు

ఇల్లంతకుంట, మార్చి 30: నిరుపేదలకు అండగా ప్రభుత్వం నిలుస్తుందని జడ్పీవైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు పేర్కొన్నారు. మండలంలోని ఒగులాపూర్‌ గ్రామానికి చెందిన సత్తయ్యకు గురువారం సీఎం సహాయనిధి చెక్కును అందించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం క్రింద మెరుగైన వైద్యం అందిస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రానివారికి సీఎం సహాయనిధి ద్వారా ఆదుకుంటుందన్నారు. పేదల ప్రజల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌లు ఉండటం వల్లనే అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఎరవెల్లి మల్లవ్వ, ఉపసర్పంచ్‌ గుండేటి ప్రశాంత్‌, నాయకులు ఆరె కొమురయ్య, అలువాల రాజేశం, ఏనుగుల సుధాకర్‌, పండుగ రాజు, అమరేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:14:14+05:30 IST