కొండగట్టుకు వంద కోట్లు కేటాయించాలి

ABN , First Publish Date - 2023-01-23T00:10:27+05:30 IST

కొండగట్టు దేవస్థానం అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రకటించిన వంద కోట్ల నిధులను వెంటనే విడుదలకు వచ్చే బడ్జెట్‌లో కేటా యించాలని చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కొండగట్టుకు వంద కోట్లు కేటాయించాలి
కొండగట్టులో మాట్లాడుతున్న మేడిపల్లి సత్యం

ఫనియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మేడిపెల్లి సత్యం

మల్యాల, జనవరి 22: కొండగట్టు దేవస్థానం అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రకటించిన వంద కోట్ల నిధులను వెంటనే విడుదలకు వచ్చే బడ్జెట్‌లో కేటా యించాలని చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కొండగట్టులో ఆయన విలేఖరులతో మాట్లాడారు. నెల రోజుల క్రితం జగిత్యాలలో సీఎం వంద కోట్లు ప్రకటించగా నెల రోజుల్లో నిధులు విడుదల అవుతాయని ఎమ్మెల్యే తెలిపారని ఇంత వరకు దాని ఊసే లేదని విమర్శించారు. నిధులు వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసు కురావాలన్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా నిధుల కోసం కృషి చేయాలని అన్నా రు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో కొండగట్టును నిర్లక్ష్యానికి గురి చేశారని యాదాద్రి, భదాద్రి తరహాలో కొండగట్టుకు నిధులు కేటాయించి అభివృద్ది చే యాలన్నారు. వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోతే భక్తులతో కలిసి ప్ర గతి భవన్‌ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో చొప్పదండి ని యోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముత్యం శంకర్‌ నాయకులు వెల్మ లక్ష్మారెడ్డి, చిలువేరి నారాయణ, గాజుల అజయ్‌, శ్రీకోటి శ్రీకాంత్‌, కొలకాని మారుతీ, చంద్రమోహన్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, రమణారెడ్డి, మారంపల్లి గంగాధర్‌, రాజు, సాయి, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-23T00:10:29+05:30 IST