మంత్రి గంగులను పరామర్శించిన మంత్రి కేటీఆర్‌

ABN , First Publish Date - 2023-01-10T23:48:19+05:30 IST

రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కుటుంబ సభ్యులను మంగళవారం రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. గంగుల మల్లయ్య చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మంత్రి గంగులను పరామర్శించిన మంత్రి కేటీఆర్‌

కరీంనగర్‌ టౌన్‌, జనవరి 10: రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కుటుంబ సభ్యులను మంగళవారం రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. గంగుల మల్లయ్య చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రితోపాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కనమల్ల విజయ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, నగర మేయర్‌ వై సునీల్‌రాఈవు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, రాజన్న జోన్‌ డీఐజీ రమేష్‌నాయకుడు మంత్రి గంగుల కమలాకర్‌ను పరామర్శించి, గంగుల మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంతిర కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌ నాయకుడు, చల్మెడ ఆనందరావు వైద్యవిజ్ఞాన సంస్థ అధినేత చల్మెడ లక్ష్మీనర్సింహరావు నివాసంలో ఏర్పాటు చేసిన తేనేటి విందులో పాల్గొన్నారు.

Updated Date - 2023-01-10T23:48:22+05:30 IST