వైభవంగా మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2023-02-16T00:15:07+05:30 IST
బ్రమరాంభ మల్లిఖార్జునస్వామి క్షేత్రంలో బు ధవారం నుంచి శివరాత్రి బ్రహోత్సవాలు వైభవోపితంగా ప్రారంభమ య్యాయి.
ఓదెల, ఫిబ్రవరి 15: బ్రమరాంభ మల్లిఖార్జునస్వామి క్షేత్రంలో బు ధవారం నుంచి శివరాత్రి బ్రహోత్సవాలు వైభవోపితంగా ప్రారంభమ య్యాయి. 16,17,18 వరకు ఆలయంలో మహశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకోని ప్రత్యేక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆల య చైర్మన్ మల్లేశం, ఈవో సదయ్య తెలిపారు. ప్రస్తుతం ఆలయం లో అగ్రోదకం, కృచ్ర్ఛారణము, మహ గనపతి, గౌరి పూజలను నిర్వ హించారు. అలాగే శివ పుణ్యావచనము, నాంది సమారాధనము, రు త్విగ్వరణము, అఖండ దీపాస్థాపన, అంకురార్పణ నిర్వహించారు. ధ్వ జరోహణ, శివయాగ మంటపము, ప్రధాన కలశస్థాపన, నిర్వహించా రు. అలాగే స్వామివారి వస్త్రాలను చైర్మన్, ఈవో సమర్పించారు. ఇత ర మండలాల నుంచి బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవానికి తరలివచ్చా రు. మరో రెండురోజులు నిర్వహించనున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలకు జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి తరలివచ్చే అవకాశం ఉన్నందున ఆలయంలో భక్తులకు అటంకాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు, మొండయ్య, సతీష్, వెంకటస్వామి, శ్రీకాంత్, కుమార్, దూపం వీరఽభధ్రయ్య, ఆలయ అర్చక సిబ్బంది పాల్గొన్నారు.