కేసీఆర్‌ పాలనలో గ్రామాలకు మహర్దశ

ABN , First Publish Date - 2023-02-21T00:34:28+05:30 IST

సీఎం కేసీఆర్‌ హయాంలో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొదురుపాక నారాయణపూర్‌ గ్రామాల్లో సోమవారం ఆయన ఉపాధిహామీ పథకం కింద మంజూరైన 20 లక్షల రూపాయల నిదులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.

కేసీఆర్‌ పాలనలో గ్రామాలకు మహర్దశ
సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

- ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి

సుల్తానాబాద్‌, ఫిబ్రవరి 20: సీఎం కేసీఆర్‌ హయాంలో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొదురుపాక నారాయణపూర్‌ గ్రామాల్లో సోమవారం ఆయన ఉపాధిహామీ పథకం కింద మంజూరైన 20 లక్షల రూపాయల నిదులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తోందని, గతంలో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి కొనసాగుతోందన్నారు. ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని వివరించా రు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కాసర్ల అనంతరెడ్డి, ఎంపీపీ బాలాజీరావు, సర్పంచ్‌ సాగర్‌రావు, స్వరూప, గుడుగుల సతీష్‌ అపర్ణ, పురం ప్రేంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T00:35:23+05:30 IST