ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2023-04-03T00:31:06+05:30 IST

రామగుండంలో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తూ ఆదివారం గోదావరిఖని చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పాలాభిషేకం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

గోదావరిఖని, ఏప్రిల్‌ 2: రామగుండంలో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తూ ఆదివారం గోదావరిఖని చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం ప్రజలంటే కేసీఆర్‌కు ఎనలేని అభిమానమని, రూ.500కోట్లతో రామగుండంలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు, సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం, కోర్టు భవనాలను ఏర్పాటు చేస్తున్నారని, అంతేకాకుండా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశంలోనే నెంబర్‌ వన్‌ ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సాగంటి శంకర్‌, బాల రాజ్‌కుమార్‌, జనగామ కవిత, కృష్ణవేణి, కో ఆప్షన్‌ మెంబర్లు వంగ శ్రీనివాస్‌, రఫిక్‌, నాయకులు మూల విజయారెడ్డి, తోడేటి శంకర్‌గౌడ్‌, నారాయణదాసు మారుతి, మెతుకు దేవరాజ్‌, బొడ్డు రవీందర్‌, చెలుకలపెల్లి శ్రీనివాస్‌, గండ్ర దామోదర్‌రావు, గుంపుల ఓదెలు, జేవీరాజు, రాకం వేణు, వడ్డేపల్లి శంకర్‌, కోడి రామకృష్ణ, ఇరుగురాళ్ల శ్రావణ్‌, జిట్టవేన ప్రశాంత్‌, మొహిద్‌ సన్ని, జాహిద్‌పాషా, మీర్‌ ఫయాజ్‌ అలీ, చిప్ప రాజేశం, పిల్లి రమేష్‌, చల్లా రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T00:31:06+05:30 IST