బుక్ఫెయిర్ను విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2023-03-02T00:56:05+05:30 IST
ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు కరీంనగర్లో నిర్వహిస్తున్న పుస్తక మహోత్సవాన్ని విజయవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు.
కరీంనగర్ కల్చరల్, మార్చి 1: ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు కరీంనగర్లో నిర్వహిస్తున్న పుస్తక మహోత్సవాన్ని విజయవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. మహాత్మా జ్యోతిబాపూలే పార్కులో జరిగే బుక్ఫెయిర్ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రదర్శన వీక్షించేందుకు వచ్చేవారు కూర్చునేందుకు కుర్చీలు, టెంట్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. పాఠశాల, కళాశాల, డిగ్రీ కళాశాల వసతిగృహాల విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, జీవీ శ్యాంప్రసాద్ లాల్, అసిస్టెంట్ కలెక్టర్ లెనిన్, ఆర్డీవో ఆనంద్కుమార్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, డీఈవో జనార్ధన్రావు, ఇంటర్మీడియట్ విద్యాధికారి రాజ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.