గ్రూప్-1 పేపర్ లీకేజీపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి
ABN , First Publish Date - 2023-03-31T00:42:39+05:30 IST
గ్రూప్ 1 పేపర్ లీకేజీపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని బీఎస్పీ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జ్ మంద రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కొడిమ్యాల, మార్చి 30 : గ్రూప్ 1 పేపర్ లీకేజీపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని బీఎస్పీ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జ్ మంద రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో జిల్లా ఇన్చార్జ్ చిర్ర శంకర్తో కలిసి పేపర్ లీకేజీ బాద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా మంద రవీందర్ మాట్లాడుతూ పేపర్ లీకేజీ, అవినీతి అక్రమాలపై సీబీఐతో దర్యాప్తు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 30 లక్షల నిరుద్యో గులకు బీఎస్పీ అండగా ఉంటుందన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగె వరకు బీఎస్పీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు దుర్గయ్య, శ్రీనివాస్, గంగరాజు, మల్లేశం, ఈశ్వర్, నరేష్, అంజన్న, ప్రేం తదితరులు పాల్గొన్నారు.