ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2023-06-01T00:09:02+05:30 IST
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, రైస్ మిల్లులకు తరలించిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
కోనరావుపేట, మే 31:ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, రైస్ మిల్లులకు తరలించిన ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని ధర్మారంలో రైతు లు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లారీల కొరతతో ధాన్యాన్ని వెంటవెంటనే తరలించడం లేదన్నారు. రైస్ మిల్లుల యజమానులు ఏదో వంక పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై కలెక్టర్ స్పందించాలని, లారీల సమస్య పరిష్క రించాలని, రైస్మిల్లర్లతో ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఎస్సై శ్రీనివాస్రెడ్డి రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు.