సింగరేణి అభివృద్ధికి కృషి చేసిన జీఎం నారాయణ

ABN , First Publish Date - 2023-03-31T00:18:16+05:30 IST

సింగరేణిలో సమర్థతతో పని చేస్తూ ఆర్‌జీ- 1ను అభివృద్ధి బాటలో నడిపించారని అక్షర ఫౌండేషన్‌ అధ్యక్ష,కార్యదర్శులు మాదాసు రామమూర్తి, బాలసాని కొమురయ్యగౌడ్‌ అన్నారు.

సింగరేణి అభివృద్ధికి కృషి చేసిన జీఎం నారాయణ

గోదావరిఖని, మార్చి 30: సింగరేణిలో సమర్థతతో పని చేస్తూ ఆర్‌జీ- 1ను అభివృద్ధి బాటలో నడిపించారని అక్షర ఫౌండేషన్‌ అధ్యక్ష,కార్యదర్శులు మాదాసు రామమూర్తి, బాలసాని కొమురయ్యగౌడ్‌ అన్నారు. గురువారం ఆర్‌జీ-1 జీఎంను ఆయన చాంబర్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.500కోట్ల నష్టంలో ఉన్న ఆర్‌జీ-1ను ప్రణాళిక బద్ధంగా నడిపించి లాభాల బాటలోకి తీసుకువచ్చారని, రామగుండం ఓసీపీ-5 విస్తరణతో పాటు అనుమతులకు క్రియా శీలకంగా పని చేశారని, ఒకే రోజు ఓసీపీ-5 ప్రారంభ రోజునే ఓబీ, బొగ్గు ను వెలికితీసి సింగరేణిలోనే నారాయణ చరిత్ర సృష్టించారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పర్లపల్లి రవి, యుగేందర్‌రెడ్డి, పెద్దపల్లి శ్రీనివాస్‌, జేవీ రాజు, చెవుల ఐలయ్య, దీటి బాలరాజు, బాపు రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:18:16+05:30 IST