దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2023-06-01T00:10:20+05:30 IST
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
- కలెక్టర్ యాస్మిన్బాషా
జగిత్యాల, మే 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. బుధవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో గల ఆడిటోరియంలో పలు ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావే శం నిర్వహించి ఉత్సవాల నిర్వహణపై దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తు న్నామన్నారు. ఒక్కోరోజు ఒక్కో అంశంపై ఉత్సవాలను నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించామని తెలిపారు. అన్ని వర్గాల భాగస్వామ్యంతో జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో వైభవోపేతంగా వేడుకలను నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బీఎస్ లత, మంద మకరందు, పలు ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.