సాగు ప్రణాళిక ఖరారు

ABN , First Publish Date - 2023-05-26T00:33:01+05:30 IST

జిల్లాలో వానాకాలం పంట ప్లానింగ్‌ ఖరారు అయింది.

సాగు ప్రణాళిక ఖరారు

జగిత్యాల, మే 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వానాకాలం పంట ప్లానింగ్‌ ఖరారు అయింది. రానున్న వానాకాలంలో రైతుల ఇబ్బందులు తొలగిం చడానికి వ్యవసాయశాఖ ముందస్తుగా సాగు ప్రణాళిక రూపొందించింది. వ్యవసాయ క్లస్టర్ల వారీగా ఎన్ని ఎకరాల్లో భూమి సాగవుతుందని అంచ నా వేసి ఈ మేరకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచ నున్నారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు రూపొందించిన వానాకాలం పం ట ప్రణాళికపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం...

సాధారణ విస్తీర్ణంకంటే ఎక్కువగా సాగు....

జిల్లా వ్యాప్తంగా సాధారణ సాగు విస్తీర్ణం కంటే అధికంగా వానాకాలం లో పంటల సాగు అవుతుందన్న అంచనాను అధికారులు వేశారు. జిల్లా లో పంటలు సాధారణ సాగు విస్తీర్ణం 3,35,976 ఎకరాలు కాగా ఈ సీ జన్‌లో 4,42,980 ఎకరాలు సాగు చేస్తారని అంచనా వేశారు. ఇది సాధా రణం కన్నా 1,07,004 ఎకరాలు అధికం. మండలాల్లోని క్లస్టర్ల వారీగా సా గు విస్తీర్ణం అంచనాలను వ్యవసాయ అధికారులు రూపొందించారు. ఇం దులో ప్రధానంగా వరి 2,98,500 ఎకరాలు, మొక్కజొన్న 40,375 ఎకరా లు, కందులు 50,125, పెసర్లు 300, ఇతర పప్పులు 675, సోయా చిక్కు డు 1875, పత్తి 19,745, చెరుకు 1200 ఎకరాలు, పసుపు 18750, ఆయిల్‌ ఫాం 4800, ఇతర పంటలు 36,250 ఎకరాల్లో సాగు కానున్నట్లు అధికా రులు అంచనా వేశారు. రైతు వేధికల ద్వారా సంబంధిత పంటలపై సిఫా ర్సు చేసిన సాగు విధానంపై కరపత్రాలు, పోస్టర్లు, బుక్‌ లెట్‌లను అందిం చడం వంటివి చేయడానికి అధికారులు నిర్ణయించారు. 2023లో ఆయిల్‌ ఫాం పంట సాగును విస్తరించాలని నిర్ణయించారు.

అందుబాటులో విత్తనాలు....

జూన్‌ 1 నుంచి వానాకాలం సీజన్‌ మొదలుకాగానే అన్నదాతలకు అవ సరమైన ఎరువులు, విత్తనాలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. వరి కి సంబంధించి వివిధ రకాల విత్తనాలు 74,625 క్వింటాళ్లు అవసరమని అంచనా వేశారు. మొక్కజొన్న 3230 క్వింటాళ్లు, కందులు 257, పెసర్లు 18, సోయాబిన్‌ 563 క్వింటాళ్లు, పత్తి 40 వేల ప్యాకెట్లు అవసరమవు తాయని అధికారులు అంచనా వేశారు.

ఎరువు ప్రణాళిక ఇలా...

జిల్లాలో ప్రతిపాదించిన పంటల విస్తీర్ణం ఆధారంగా ఎరువుల ప్రణా ళికలు తయారు చేశారు. జిల్లాకు అవసరమైన ఎరువుల సరఫరాకు ప్ర భుత్వానికి ప్రతిపాదనలను అధికారులు సమర్పించారు. రానున్న వానా కాలం సీజన్‌లో జిల్లాలో మొత్తం కాంప్లెక్స్‌ 45,500 మెట్రిక్‌ టన్నులు అ వసరమవుతాయన్న అంచనా ఉంది. యూరియా 40,797, డీఏపీ 11,699, ఎంవోపీ 10,257 మెట్రిక్‌ టన్నులు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇందులో జూన్‌ మాసంలో కాంప్లెక్స్‌ 9,100, జూలైలో 13,650 ఆగస్టు 13,650, సెప్టెంబరులో 9,100 మెట్రిక్‌ టన్నులు అవసరమని అంచనా వే సి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

నకిలీ విత్తన వ్యాప్తి అరికట్టడానికి కార్యాచరణ ప్రణాళిక...

జిల్లాలో 450 విత్తన విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా విత్తనాన్ని రైతులకు అందుబాటులో ఉంచనున్నారు. నకిలీ పత్తి, ఇతర వి త్తన విక్రయాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో భాగంగా పోలీ సులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి బృందాలను ఏర్పాటు చేశా రు. మే 3వ వారం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని విత్తన విక్రయ కేంద్రా ల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనం, ఎరువుల, పరుగు మందులు అందించడానికి అధికారులు ఇచ్చిన లక్ష్యం ప్రకారం ప్రతీ ఎరువు, విత్తన దుకాణాలను తనిఖీ చేసి నమునాలను సేకరించి ప రీక్షా కేంద్రానికి పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

అంచనాలు రూపొందించాం

- సురేశ్‌ కుమార్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

జిల్లాలో వానాకాలం పంట సాగు అంచనాలను రూపొందించాము. అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచేందుకు కసరత్తులు చేస్తున్నాము. జిల్లాలో ప్రధానంగా వరి, ఇతర పంటలను సాగు చేస్తారు. ఇందుకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వా రా సిద్ధం చేస్తున్నాము. రైతులకు పంట సాగుపై అవగాహన కల్పిం చడానికి నిర్ణయించాం.

Updated Date - 2023-05-26T00:33:01+05:30 IST