గ్రామస్థాయిలో కార్పొరేట్‌ వైద్యం

ABN , First Publish Date - 2023-06-26T00:39:51+05:30 IST

గ్రామీణస్థాయి ప్రజలకు ఇండియన్‌ మెడికల్‌ అసో సియేషన్‌ ఆధ్వర్యంలో కార్పొరేట్‌ వైద్యం అందించడం శుభపరిణామమని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు.

గ్రామస్థాయిలో కార్పొరేట్‌ వైద్యం

పెద్దపల్లి రూరల్‌, జూన్‌ 25: గ్రామీణస్థాయి ప్రజలకు ఇండియన్‌ మెడికల్‌ అసో సియేషన్‌ ఆధ్వర్యంలో కార్పొరేట్‌ వైద్యం అందించడం శుభపరిణామమని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కాసులపల్లి గ్రామంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెడికల్‌ క్యాంపును ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రారంభించారు. ఈసంధర్బంగా ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం బాగుండాలని ఒక మంచి నినాదంతో ముం దుకు వెళ్లడం ఒక మంచి కార్యక్రమమన్నారు. గ్రామంలోని ఆయా రోగాలతో బాధ పడే రోగులు వైద్యుల వద్దకు వెళ్లేవారని, నేడు గ్రామస్థాయిలో కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం అందించడం చాలా బాగుందన్నారు. ఉచి తంగా అందిస్తున్న మెడికల్‌ క్యాంపును సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో వైద్యులు వాసు దేవారెడ్డి, రమాకాంత్‌, ప్రణీత్‌, మల్లేశం, రాజు, జితేందర్‌, శ్రీకాంత్‌, రాం మోహన్‌, కృష్ణారెడ్డి, మైథిలి, ధర్మేందర్‌, శ్రీదేవి రెడ్డి, మహేందర్‌, రాజ్‌కుమార్‌, చందు మమతా రెడ్డిలతో పాటు సింగిల్‌ విండో చైర్మన్‌ దాసరి చంద్రారెడ్డి, సర్పంచ్‌లు గోపు కవిత-శ్రీనివాస్‌, దాతు మంజుల-సదయ్య, ఎంపీటీసీ లక్ష్మీ-రాజేశం పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:39:51+05:30 IST