బీఆర్‌ఎస్‌లో చేరిన కాంట్రాక్టు కార్మికులు

ABN , First Publish Date - 2023-03-31T00:12:51+05:30 IST

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే చందర్‌ అన్నారు.

బీఆర్‌ఎస్‌లో చేరిన కాంట్రాక్టు కార్మికులు

గోదావరిఖని, మార్చి 30: సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే చందర్‌ అన్నారు. కాంట్రాక్టు కార్మికులు గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించడమే కేసీఆర్‌ లక్ష్యమని, సింగరేణి సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మి కుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, తెలంగాణ ఏర్ప డిన తరువాత సింగరేణి సంస్థలోని కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాలు ఇ ప్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్‌, నాయకులు చంద్రమౌళి, దొమ్మేటి వాసు, సాయి, సురేష్‌, విజయ్‌, రాకేష్‌, రవి, కిరణ్‌ సాయి పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:12:51+05:30 IST