ధర్మపురిలో వైభవంగా చందనోత్సవం

ABN , First Publish Date - 2023-05-02T00:36:05+05:30 IST

నరసింహ నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయంలో సోమవారం చందనోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిం చారు.

ధర్మపురిలో వైభవంగా చందనోత్సవం
యోగా నారసింహ స్వామిని అందంగా చందనంతో అలంకరణ చేసిన దృశ్యం

ధర్మపురి, మే 1: నరసింహ నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయంలో సోమవారం చందనోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిం చారు. గత నెల 26 నుంచి ఆరంభమైన నవరాత్రోత్సవాల్లో భా గంగా ఆరవ రోజు ఉదయం ఆలయ వేదపండితులు బొజ్జ రమేష్‌శర్మ, సామవేద పండితులు ముత్యాలశర్మ తదితర వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణల అర్చకులు స్వామి వారలకు ప్ర త్యేక పూజలు నిర్వహించారు. యోగ, ఉగ్ర నారసింహుల ను అందంగా చందనంతో అలంకరించారు. అలాగే లోక కళ్యాణార్థం నిత్యం సుదర్శన, నారసింహ, రుద్ర హోమాలు నిర్వహించారు. గోదావరిలో స్నానాలు చేసిన భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సం కటాల శ్రీనివాస్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ధర్మపురి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ, వైస్‌చైర్మన్‌, ఆలయ రినోవేషన్‌ కమిటీ సభ్యులు ఇందారపు రామయ్య, సభ్యులు రవీందర్‌, రమ, పద్మ, సురేందర్‌, రవి, రమేష్‌, నరేష్‌, రాజమౌళి, కొమురయ్య, మహేష్‌, సురేష్‌, సూపరింటెండెంట్‌ ద్యావళ్ల కిరణ్‌ కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ అలువాల శ్రీనివాస్‌, బొజ్జ సంతో ష్‌కుమార్‌, సంపత్‌కు మార్‌, రాజగోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-05-02T00:36:05+05:30 IST