వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి అస్వస్థత

ABN , First Publish Date - 2023-05-27T03:18:06+05:30 IST

వివేకా హత్య కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఎంపీ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి శుక్రవారం ఉదయం బీపీ పెరగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి అస్వస్థత

● ఉస్మానియాలో వైద్య పరీక్షలు

సైదాబాద్‌, మే 26(ఆంధ్రజ్యోతి): వివేకా హత్య కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఎంపీ అవినాశ్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి శుక్రవారం ఉదయం బీపీ పెరగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే జైలు అధికారులు భాస్కర్‌ రెడ్డిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తీసుకువచ్చారు. ఉస్మానియా వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యానికి శనివారం నిమ్స్‌ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉండొచ్చని జైలు వర్గాలు తెలిపాయి.

Plant Banana Peels All Over Your Garden, Look What Happens A Week LaterTips and Tricks|Sponsored

New Small Electric Cars For Seniors - The Price May Surprise YouElectric Cars | Search Ads|Sponsored


Updated Date - 2023-05-27T03:18:06+05:30 IST