అమరుల ఆకాంక్షలు నెరవేర్చాలి
ABN , First Publish Date - 2023-06-02T02:57:01+05:30 IST
రాష్ట్ర ప్రజలకు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సకల జనుల అలుపెరుగని పోరాటాలు..
ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: కాసాని
హైదరాబాద్, జూన్ 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలకు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సకల జనుల అలుపెరుగని పోరాటాలు, అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఆయన గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆరు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానంతో సాధించుకున్న స్వరాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం విషయంలో ప్రతిపక్షాలకు పెద్దపీట దక్కకపోవడం శోచనీయమన్నారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు పతనం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం స్ఫూర్తితో సబ్బండ వర్ణాలు మమేకమవుతూ అమరవీరుల ఆకాంక్షలు ఫలించేలా దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కాసాని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు.