తెలంగాణ వర్సిటీ ఇన్చార్జి వీసీగా వాకాటి కరుణ
ABN , First Publish Date - 2023-07-15T04:56:21+05:30 IST
నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయం ఇన్చార్జి వైస్ చాన్సలర్గా విద్యాశాఖ కార్యదర్శి, ఉన్నత విద్యా కమిషనర్ వాకాటి కరుణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.
హైదరాబాద్/ నిజామాబాద్ జూలై 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయం ఇన్చార్జి వైస్ చాన్సలర్గా విద్యాశాఖ కార్యదర్శి, ఉన్నత విద్యా కమిషనర్ వాకాటి కరుణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఇంత కాలం వీసీగా పనిచేసిన డాక్టర్ రవీందర్ గుప్తా, ఓ ప్రైవేటు కళాశాలకు పరీక్షా కేంద్రాన్ని మంజూరు చేయడానికి రూ.50 వేలు లంచం తీసుకుంటూ జూన్ 17న ఏసీబీకి పట్టుబడి, జైలుకు వెళ్లారు. అప్పటి నుంచి వీసీ లేకపోవడంతో వర్సిటీలో కార్యకలాపాలు స్తంభించడం, ఉద్యోగులకు జీతభత్యాల చెల్లింపులో ఇబ్బందులు వస్తుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త వీసీని నియమించే వరకూ ఆమె ఆ హోదాలో కొనసాగనున్నారు. అయితే రవీందర్ గుప్తా బెయిల్పై విడుదలైన రోజే కరుణను ఇంచార్జి వీసీగా నియమించడం గమనార్హం.