సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రభాకర్‌ మృతి

ABN , First Publish Date - 2023-02-13T04:24:33+05:30 IST

తెలుగు దిన పత్రికల్లో సుమారు 30 ఏళ్లపాటు సేవలందించిన సీనియర్‌ జర్నలిస్ట్‌ పెందుర్తి ప్రభాకర్‌ (55) ఆదివారం చనిపోయారు.

సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రభాకర్‌ మృతి

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): తెలుగు దిన పత్రికల్లో సుమారు 30 ఏళ్లపాటు సేవలందించిన సీనియర్‌ జర్నలిస్ట్‌ పెందుర్తి ప్రభాకర్‌ (55) ఆదివారం చనిపోయారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక స్టేట్‌ బ్యూరో రిపోర్టర్‌గా, ఇంటర్నెట్‌ డెస్క్‌ సబ్‌ ఎడిటర్‌గా ఇటీవలి వరకు పని చేసిన ఆయన 10 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుఝామున మృతి చెందారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో మండలం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ హోదాల్లో ప్రభాకర్‌ పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, తోటి జర్నలిస్టులు సంతాపం తెలిపారు.

Updated Date - 2023-02-13T04:24:34+05:30 IST