కోలుకుంటున్న సీపీఐ నేత పువ్వాడ
ABN , First Publish Date - 2023-03-31T03:47:03+05:30 IST
తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు కోలుకుంటున్నారు.
ఖమ్మం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు కోలుకుంటున్నారు. బుధవారం ఖమ్మంలోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను తొలుత ఖమ్మంలోనే చికిత్స అందించి ఆ తర్వాత సికింద్రాబాద్ కిమ్స్కు తరలించారు. ఈ క్రమంలోనే గురువారం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ దగ్గరుండి తన తండ్రి వైద్యసేవలను పర్యవేక్షిస్తున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ నేత చాడ వెంకట్ రెడ్డి, పలువురు పార్టీ నేతలు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి పువ్వాడ నాగేశ్వరరావును పరామర్శించారు.