‘ప్రీతి’ కేసు నిందితుడు సైఫ్కు బెయిల్
ABN , First Publish Date - 2023-04-21T04:13:32+05:30 IST
వరంగల్ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్ సైఫ్కు బెయిల్ మంజూరైంది. రెండు నెలలుగా ఖమ్మం జిల్లా జైలులో రిమాండులో ఉన్న సైఫ్కు బుధవారమే షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.
ఖమ్మంక్రైం, ఏప్రిల్ 20: వరంగల్ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్ సైఫ్కు బెయిల్ మంజూరైంది. రెండు నెలలుగా ఖమ్మం జిల్లా జైలులో రిమాండులో ఉన్న సైఫ్కు బుధవారమే షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. అయితే పూచీకత్తు, సంతకాల విషయంలో జాప్యం జరగడం విడుదల ఆలస్యమైంది. సాధారణ కోర్టు వాయిదా ఉండడంతో సైఫ్ని పోలీసులు గురువారం వరంగల్ కోర్టులో హాజరుపరిచారు. బెయిల్ ఉత్తర్వుల కాపీ వరంగల్ కోర్టు నుంచి గురువారం సాయంత్రం రావడంతో సైఫ్ను కోర్టు నుంచి ఖమ్మం జైలుకు తీసుకు వచ్చి సంతకాలు తీసుకుని సాయంత్రం ఆరుగంటల సమయంలో సైఫ్ను విడుదల చేశారు.