తెలంగాణకు పీఎం స్వనిధి జాతీయ అవార్డు
ABN , First Publish Date - 2023-06-02T03:10:38+05:30 IST
పురపాలికల్లో వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో ముందంజలో నిలిచినందుకుగానూ తెలంగాణకుజాతీయ అవార్డు దక్కింది. దేశంలోని వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్రం ‘పీఎం స్వనిధి’ పథకాన్ని ప్రారంభించింది.
హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): పురపాలికల్లో వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో ముందంజలో నిలిచినందుకుగానూ తెలంగాణకుజాతీయ అవార్డు దక్కింది. దేశంలోని వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్రం ‘పీఎం స్వనిధి’ పథకాన్ని ప్రారంభించింది. దీన్ని ప్రారంభించి మూడేళ్లయిన సందర్భంగా ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీంట్లో పాల్గొని.. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్దీ్పసింగ్పూరి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం తరుఫున పురపాలక, పట్టణాభివృద్ధి కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, మెప్మా ప్రాజెక్టు మేనేజర్ చైతన్య ఈ అవార్డును అందుకున్నారు.