Godse Photo: శోభాయాత్రలో గాడ్సే ఫొటో!

ABN , First Publish Date - 2023-03-31T02:44:46+05:30 IST

శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో గాడ్సే ఫొటోను ప్రదర్శించడం కలకలం రేపింది.

 Godse Photo: శోభాయాత్రలో గాడ్సే ఫొటో!

ఓల్డ్‌ సిటీలో రాజాసింగ్‌ ఆధ్వర్యంలో యాత్ర

గాంధీ హంతకుడి భారీ ఫొటో ప్రదర్శన

అప్జల్‌గంజ్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో గాడ్సే ఫొటోను ప్రదర్శించడం కలకలం రేపింది. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ధూల్‌పేట్‌లోని ఆకా్‌షపురి హనుమాన్‌ మందిర్‌ నుంచి గురువారం శోభాయాత్ర నిర్వహించారు. రాజాసింగ్‌ వాహనంపై ఉన్న సమయంలోనే కొందరు యువకులు శ్రీరాముని జెండాలతోపాటుజాతిపిత గాంధీని చంపిన నాథూరామ్‌ గాడ్సే ఫొటోను ప్రదర్శించారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - 2023-03-31T02:44:46+05:30 IST