హైకోర్టు బార్ అధ్యక్షుడిగా పల్లె నాగేశ్వరరావు
ABN , First Publish Date - 2023-04-02T04:00:51+05:30 IST
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పల్లె నాగేశ్వరరావు ఎన్నికయ్యారు.
హైదరాబాద్, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పల్లె నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. ఈ పదవిని అధిష్ఠించిన తొలి దళితునిగా ఆయన రికార్డు సృష్టించారు. శుక్రవారం ఎన్నికలు జరగగా శనివారం పూర్తి ఫలితాలు వెల్లడయ్యాయి. తన సమీప ప్రత్యర్థి ఎ. జగన్పై 381 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నాగేశ్వరరావుకు 1120, జగన్కు 739, రవీందర్రెడ్డి 675 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షుడిగా కల్యాణ్రావు(1115 ఓట్లు), కార్యదర్శులుగా ప్రదీ్పరెడ్డి(1310), పులి దేవేందర్(1226) ఎన్నికయ్యారు.