నారాయణ విద్యార్థికి ... జేఈఈ-మెయిన్‌లో 300కి 300 మార్కులు

ABN , First Publish Date - 2023-04-27T04:08:29+05:30 IST

జేఈఈ మెయిన్‌ సెషన్‌-2లో తమ సంస్థలో చదివిన పి.లోహిత్‌ ఆదిత్య సాయి అనే విద్యార్థికి 300కి 300ల మార్కులు వచ్చినట్టు నారాయణ విద్యా సంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ పి.ప్రమీల తెలిపారు.

నారాయణ విద్యార్థికి ... జేఈఈ-మెయిన్‌లో 300కి 300 మార్కులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్‌ సెషన్‌-2లో తమ సంస్థలో చదివిన పి.లోహిత్‌ ఆదిత్య సాయి అనే విద్యార్థికి 300కి 300ల మార్కులు వచ్చినట్టు నారాయణ విద్యా సంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ పి.ప్రమీల తెలిపారు. సోమవారం ఎన్‌టీఏ విడుదల చేసిన జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 తుది కీని పరిశీలించగా ఈ విషయం తెలిసిందన్నారు. లోహిత్‌ మొదటి 10 ర్యాంకుల్లో నిలిచే అవకాశం ఉందని ఆమె చెప్పారు. లోహిత్‌ పాఠశాల విద్య నుంచి ఇంటర్‌ వరకు నెల్లూరులోని నారాయణ విద్యా సంస్థల్లో చదివారని ప్రమీల తెలిపారు.

Updated Date - 2023-04-27T04:08:29+05:30 IST