Minister Mallareddy : తూముకుంట ఆలయ భూముల వివాదంలో మంత్రి మల్లారెడ్డి

ABN , First Publish Date - 2023-06-16T13:15:30+05:30 IST

తూముకుంట ఆలయ భూముల వివాదంలో మంత్రి మల్లారెడ్డి చిక్కుకున్నారు. వేంకటేశ్వర స్వామి ఆలయానికి కేటాయించిన స్థలంలో మంత్రి మల్లారెడ్డి కబ్జాకు యత్నించారు. 9 ఎకరాల్లో వేంకటేశ్వర స్వామికి ఆలయానికి కేటాయించిన స్థలంలో మల్లన్న టెంపుల్ నిర్మాణానికి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు.

Minister Mallareddy : తూముకుంట ఆలయ భూముల వివాదంలో మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ : హైదరాబాద్‌లోని తూముకుంట ఆలయ భూముల వివాదంలో మంత్రి మల్లారెడ్డి చిక్కుకున్నారు. వేంకటేశ్వర స్వామి ఆలయానికి కేటాయించిన స్థలంలో మంత్రి మల్లారెడ్డి కబ్జాకు యత్నించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 9 ఎకరాల్లో వేంకటేశ్వర స్వామికి ఆలయానికి కేటాయించిన స్థలంలో మల్లన్న టెంపుల్ నిర్మాణానికి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. వేంకటేశ్వర స్వామి ఆలయ భూముల్లో మల్లన్న ఆలయం ఎలా కడతారంటూ అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ భూములను కబ్జా చేసేందుకు మంత్రి మల్లారెడ్డి యత్నిస్తున్నారంటూ అర్చకులు ఆరోపిస్తున్నారు. మల్లన్న ఆలయం నిర్మాణం పేరుతో దౌర్జన్యంగా వేంకటేశ్వర స్వామి ఆలయ భూములు తీసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-06-16T13:16:06+05:30 IST