18వ నిందితుడిగా మాగుంట రాఘవ్రెడ్డి
ABN , First Publish Date - 2023-05-02T03:34:04+05:30 IST
ఢిల్లీ మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ్ రెడ్డిది కీలక పాత్ర అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది.
మాగుంట ఆగ్రోఫామ్స్, పిక్సి ఎంటర్ప్రైజెస్ను
కూడా అనుబంధ చార్జిషీట్లో చేర్చిన ఈడీ
స్కాంలో ఆయనది కీలక పాత్రని స్పష్టీకరణ
చార్జిషీట్లో ఎమ్మెల్సీ కవిత పేరూ ప్రస్తావన
అనుబంధ చార్జిషీట్లో చేర్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
చార్జిషీట్లో కల్వకుంట్ల కవిత పేరు కూడా ప్రస్తావన
న్యూఢిల్లీ, మే 1(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ్ రెడ్డిది కీలక పాత్ర అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ఆయనను 18వ నిందితుడిగా, ఆయనకు చెందిన మాగుంట ఆగ్రో ఫామ్స్ ప్రైవేటు లిమిటెడ్, పిక్సి ఎంటర్ప్రైజె్సలను కూడా నిందితులుగా చేరుస్తూ ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీటును సోమవారం రౌజ్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో రాఘవ్ రెడ్డిని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం వ్యాపారంలో వివిధ సంస్థలు కుమ్మక్కై లైసెన్సులు పొందడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చార్జిషీటులో పేర్కొంది.
చెన్నైలోని ఎన్రికా ఎంటర్ప్రైజె్సకు ఆయన యజమాని అని, రిటైల్, హోల్సేల్ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని మద్యం విధానంలో స్పష్టంగా ఉన్నా.. మాగుంట ఆగ్రో ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట రెండు రిటైల్ జోన్లు పొందారని తెలిపింది. రాఘవ్ తరఫున ఆయన బినామీ ప్రేమ్ రాహుల్ మండూరి ఇండో స్పిరిట్స్ సంస్థలో 32.5 శాతం వాటాలు పొందారని పేర్కొంది. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల ముడుపులు చెల్లించిన సౌత్ గ్రూపులో ఉన్నారని తెలిపింది. రాఘవ్ మాగుంట ఐదు ఖాతాల ద్వారా ఇండో స్పిరిట్స్ సంస్థకు డబ్బులు బదిలీ చేశారని ఆరోపించింది. రాఘవ్, ఆయన తండ్రి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి జీఎంఆర్ సంస్థకు చెందిన బీవీ నాగేశ్వర రావును కలుసుకొని ఢిల్లీలో ఎయిర్పోర్టులో ఎన్వోసీ పొందే విషయంపై చర్చించారని తెలిపింది.
తన వ్యాపారంలో జీఎంఆర్ను భాగస్వామిని చేసుకునేందుకు ఆయనను కలుసుకున్నట్లు శ్రీనివాసులు రెడ్డి - జీఎంఆర్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ను బట్టి తెలుస్తోందని ఈడీ వెల్లడించింది. ఎయిర్పోర్టు జోన్లో పిక్సి ఎంటర్ప్రైజె్సకు ఎన్వోసీ పొందేందుకు శ్రీనివాసులు రెడ్డి చేసిన ప్రయత్నాలు నెరవేరలేదని పేర్కొంది. దాంతో ఎక్సైజ్ శాఖ నుంచి ప్రతిపాదనలు లేకుండానే మనీశ్ సిసోడియా ఏకపక్షంగా ఈఎండీ మొత్తాన్ని పిక్సి ఎంటర్ప్రైజ్సకు తిరిగి చెల్లించాలని నిర్ణయించారని వివరించింది. కాగా, ‘‘2021 సెప్టెంబరు 29న బుచ్చిబాబుకు రాఘవ్ మాగుంటకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ప్రకారం.. అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్ (ఏబీడీ)కి ఎల్1 వ్యాపారం గురించి, అందులో హైదరాబాద్పై ఆసక్తి గురించి ప్రస్తావన వచ్చింది. రాఘవ్ గ్రూపునకు ఎల్1 వ్యాపారం ఇచ్చే విషయంలో తెలంగాణ ప్రభుత్వ స్థాయి నుంచి ఒక వ్యక్తి ఏబీడీతో మాట్లాడతారని బుచ్చిబాబు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అంటే కల్వకుంట్ల కవిత అని బుచ్చిబాబు రాఘవ్కు చెప్పారు.
అయితే, ఆ తర్వాత ఏబీడీతో చర్చించనవసరం లేదని బుచ్చిబాబు రాఘవ్కు తెలిపారు. ఆ తర్వాత కవితకు సన్నిహిత సహచరుడైన సృజన్ రెడ్డితో కలిసి ఆమె, బుచ్చిబాబు వ్యాపారాన్ని ఏర్పాటు చేశారు. సృజన్కు వ్యాపారం ఇచ్చినందువల్ల మరెవరితోనూ మాట్లాడకూడదని బుచ్చిబాబు రాఘవ్కు తెలిపారు. ‘హైదరాబాద్ వాటాను కోరుతున్నది’ అని బుచ్చిబాబు చెప్పిన మాటల్లో కవిత గురించే ప్రస్తావించారు. సమీర్తో, మరెవరితో కాక తామే మొత్తం వ్యాపారం చేయదల్చుకున్నామని బుచ్చిబాబు అన్నారు. బకార్డి బ్రాండ్ పంపిణీ గురించి కూడా వాట్సాప్ చాట్లో వారు చర్చించారు’’ అని ఈడీ పేర్కొంది.