దేశంలో ‘శ్రీ చైతన్య’ నం. 1

ABN , First Publish Date - 2023-03-26T02:14:55+05:30 IST

ఐఎన్‌టీఎ్‌సవో ఒలింపియాడ్‌లో శ్రీ చైతన్య విద్యార్థులు ఆలిండియా ర్యాంకులు సాధించడంతో దేశంలో శ్రీ చైతన్య విద్యాసంస్థలే నెంబర్‌ వన్‌ అని మరోమారు నిరూపితమైందని శ్రీ చైతన్య స్కూల్‌ డైరెక్టర్‌ సీమ అన్నారు.

దేశంలో ‘శ్రీ చైతన్య’ నం. 1

అది మరోమారు నిరూపితమైంది: డైరెక్టర్‌ సీమ

ఐఎన్‌టీఎ్‌సవో ఒలింపియాడ్‌లో ఆలిండియా ర్యాంకులు సాధించిన విద్యార్థులు

హైదరాబాద్‌, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ఐఎన్‌టీఎ్‌సవో ఒలింపియాడ్‌లో శ్రీ చైతన్య విద్యార్థులు ఆలిండియా ర్యాంకులు సాధించడంతో దేశంలో శ్రీ చైతన్య విద్యాసంస్థలే నెంబర్‌ వన్‌ అని మరోమారు నిరూపితమైందని శ్రీ చైతన్య స్కూల్‌ డైరెక్టర్‌ సీమ అన్నారు. ఇటీవల 3-10 తరగతి విద్యార్థులకు జరిగిన ఐఎన్‌టీఎ్‌సవో పరీక్షా ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు ఆధిపత్యాన్ని చాటారని తెలిపారు. ఆలిండియా స్థాయిలో ఐఎన్‌టీఎ్‌సవో 150 ల్యాప్‌టా్‌పలను ప్రకటించగా అత్యధికంగా 96 మంది (64 శాతం) శ్రీ చైతన్య విద్యార్థులు ల్యాప్‌టా్‌పలను గ్రాండ్‌ ప్రైజ్‌లుగా సాధించారని, వీటితో పాటు ఐఎన్‌టీఎ్‌సవో 750 ట్యాబ్‌లను ప్రకటించగా అత్యధికంగా 472(63శాతం) మంది సాధించారన్నారు. టాప్‌ 5 ర్యాంకులలో 58 శాతం, ప్రకటించిన మెడల్స్‌లో 61 శాతం మేర తమ విద్యార్థులే సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను శ్రీ చైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్‌ డా.బి.య్‌సరావు అభినందించారని తెలిపారు. ర్యాంకులు సాధించడానికి విద్యాసంస్థల సి-ఐపియల్‌, యమ్‌.పి.యల్‌, ఐకాన్‌, సి-బ్యాచ్‌, ఎస్‌-బ్యాచ్‌, మెడికాన్‌, టెక్నో వంటి పటిష్ఠమైన అకడమిక్‌ ప్రోగ్రామ్స్‌, మైక్రో లెవల్‌ టీచింగ్‌ సిస్టమ్స్‌తో పాటు అంకితభావంతో పనిచేసే అఽధ్యాపకులే కారణమని పేర్కొన్నారు.

Updated Date - 2023-03-26T02:14:55+05:30 IST