Hyderabad: దుర్గం చెరువు దుస్థితిపై విచారణకు త్రిసభ్య కమిటి..
ABN , Publish Date - Dec 23 , 2023 | 12:53 PM
దుర్గం చెరువు దుస్థితిపై విచారణ కోసం తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 22 శుక్రవారం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. సరస్సు వద్ద చనిపోయిన చేపలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవడంతో తెలంగాణ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. NEERIకి చెందిన అతుల్ నారాయణ్ వైద్య అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీ దుర్గం చెరువులో నెలకొన్న పరిస్థితులపై దర్యాప్తు చేసి దాని పునరుద్ధరణ పనులను పర్యవేక్షించనుంది.
హైదరాబాద్: దుర్గం చెరువు దుస్థితిపై విచారణ కోసం తెలంగాణ హైకోర్టు డిసెంబర్ 22 శుక్రవారం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. సరస్సు వద్ద చనిపోయిన చేపలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవడంతో తెలంగాణ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. NEERIకి చెందిన అతుల్ నారాయణ్ వైద్య అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీ దుర్గం చెరువులో నెలకొన్న పరిస్థితులపై దర్యాప్తు చేసి దాని పునరుద్ధరణ పనులను పర్యవేక్షించనుంది.
ఈ నిపుణుల కమిటీలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) లేదా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (PCB) సభ్యులెవరూ ప్యానెల్లో లేకపోవడం గమనార్హం. చెరువు నాశనానికి హెచ్ఎండీఏ, పీసీబీలు సహకరించాయనే ఆరోపణల నడుమ హైకోర్టు వారిని పక్కనబెట్టేసింది. అలాగే ప్యానెల్ను ప్రభావితం చేయడానికి లేదంటే దర్యాప్తును అడ్డుకోవడానికి ప్రయత్నించకుండా హెచ్చరికలు సైతం హైకోర్టు జారీ చేసింది. ప్యానెల్కు ఆర్థికంగా అన్ని విధాలా సహకరిస్తూ రక్షణ కల్పించాలని పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.