దేశాన్ని రావణకాష్టం చేస్తున్న ప్రభుత్వాలు: భట్టి

ABN , First Publish Date - 2023-03-31T03:28:36+05:30 IST

కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు దేశాన్ని రావణకాష్టంగా మారుస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.

దేశాన్ని రావణకాష్టం చేస్తున్న ప్రభుత్వాలు: భట్టి

బెల్లంపల్లి, మార్చి 30: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు దేశాన్ని రావణకాష్టంగా మారుస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కోదండ రామాలయంలో గురువారం జరిగిన సీతారాముల కల్యాణంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముడు ప్రజల సంక్షేమం కోసమే పాలన సాగించాడని అన్నారు. ప్రస్తుత పాలకులు ప్రజాభీష్టం మేరకు ప్రజల సంక్షేమానికి శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకుని పాలన సాగించాల్సి ఉండగా దేశాన్ని రావణ కాష్టంగా మార్చారని విమర్శించారు. రావణకాష్టాన్ని రామరాజ్యంగా మార్చడానికి, ప్రజానీకం సమభావంతో మెలిగేలా చేయడానికి ప్రగతిశీల భావాలు గల కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యపడుతుందని అన్నారు.

Updated Date - 2023-03-31T03:29:48+05:30 IST