రాజకీయ కుట్రలతోనే ఆప్ నేతలపై ఈడీ కేసులు
ABN , First Publish Date - 2023-02-07T00:29:21+05:30 IST
కేంద్ర ప్రరభుత్వం రాజకీయ కుట్రలతోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా నకిలీ కేసులు బనాయించి చార్జిషీట్ను దాఖలు చేయిందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ డి.సుధాకర్ ఆరోపించారు.
అఫ్జల్గంజ్, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రరభుత్వం రాజకీయ కుట్రలతోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆప్ నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా నకిలీ కేసులు బనాయించి చార్జిషీట్ను దాఖలు చేయిందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ డి.సుధాకర్ ఆరోపించారు. లిబర్టీ సర్కిల్ ఆఫ్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సుధాకర్ మాట్లాడుతూ... రాజకీయ ఆస్తిత్వంగా క్రమంగా ఎదుగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తులో తమకు సవాలుగా మారుతుందన్న భయంతో కేంద్ర ప్రభుత్వం నకిలీ కేసులు బనాయిం చిందన్నారు. సమావేశంలో ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు రాములు గౌడ్, ప్రొఫెషనల్ టీమ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ హరిచరణ్, నాయకులు అబ్దుల్ ముక్తాధీర్, మహ్మద్ మాజిద్, ఎండీ అఫ్జల్, అఫ్సా, టి.రాకేశ్ సింగ్, మోమిన్, జావేద్ తదితరులు పాల్గొన్నారు.