దుర్గం చిన్నయ్యకు ప్రజల చేతిలో శిక్ష తప్పదు

ABN , First Publish Date - 2023-04-03T03:32:52+05:30 IST

అవినీతి, అక్రమాలతో మహిళలను వేధిస్తున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ప్రజల చేతిలో శిక్ష తప్పదని భారత....

దుర్గం చిన్నయ్యకు ప్రజల చేతిలో శిక్ష తప్పదు

మావోయిస్టు కోల్‌బెల్ట్‌ కమిటీ కార్యదర్శి ప్రభాత్‌

మంచిర్యాల, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): అవినీతి, అక్రమాలతో మహిళలను వేధిస్తున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ప్రజల చేతిలో శిక్ష తప్పదని భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) సింగరేణి కోల్‌బెల్ట్‌ కమిటీ కార్యదర్శి ప్రభాత్‌ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులను గూండాలుగా, రౌడీలుగా, కబ్జాకోరులుగా తీర్చిదిద్దడమే కాకుండా మహిళలను వేధిస్తూ చిన్నయ్య బరితెగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళల ఫిర్యాదుతో చిన్నయ్యను గతంలోనే హెచ్చరించామని ప్రభాత్‌ తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఒక వ్యభిచార సంస్థగా, భూకబ్జాలకు, రౌడీలకు అడ్డాగా మారిందని ఆరోపించారు. ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2023-04-03T03:32:52+05:30 IST