జూన్‌ 9న చేపప్రసాదం పంపిణీ

ABN , First Publish Date - 2023-05-24T05:04:15+05:30 IST

కరోనా మహమ్మారి వల్ల హైదరాబాద్‌లో మూడేళ్లుగా నిలిచిపోయిన చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. ఎప్పట్లాగే నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ వేదికగా జూన్‌ 9న చేపప్రసాదం పంపిణీ జరగనుంది.

జూన్‌ 9న చేపప్రసాదం పంపిణీ

హైదరాబాద్‌ సిటీ, మే 23 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి వల్ల హైదరాబాద్‌లో మూడేళ్లుగా నిలిచిపోయిన చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. ఎప్పట్లాగే నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ వేదికగా జూన్‌ 9న చేపప్రసాదం పంపిణీ జరగనుంది. ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి 24 గంటలపాటు నిరంతరాయంగా చేపప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు బత్తిన సోదరులు గౌరీ శంకర్‌గౌడ్‌, శివశంకరగౌడ్‌, అమర్నాథ్‌ గౌడ్‌లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ జూన్‌ 9న నిర్వహించ తలపెట్టిన కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతినిచ్చిందని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు.


Updated Date - 2023-05-24T05:04:15+05:30 IST