Hyderabad: ఇంట్లో చెప్పి వెళ్లిన ఇద్దరు యువతుల అదృశ్యం

ABN , First Publish Date - 2023-02-02T10:21:47+05:30 IST

వేర్వేరు ఘటనల్లో జవహర్‌నగర్‌ పోలీ‌స్ స్టేషన్‌ పరిధిలో ఇద్దరు యువతులు

Hyderabad: ఇంట్లో చెప్పి వెళ్లిన ఇద్దరు యువతుల అదృశ్యం

హైదరాబాద్/జవహర్‌నగర్‌: వేర్వేరు ఘటనల్లో జవహర్‌నగర్‌ పోలీ‌స్ స్టేషన్‌ పరిధిలో ఇద్దరు యువతులు అదృశ్యమయ్యారు. ఇంటర్వ్యూకు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ యువతి తిరిగిరాని ఘటన జవహర్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లోని న్యూ గబ్బిలాల్‌పేటకు చెందిన స్వాతి (25) డిగ్రీ పూర్తి చేసింది. గత నెల 31న ఇంటర్యూ ఉందంటూ ఇంట్లో చెప్పి వెళ్లిపోయిన స్వాతి తిరిగి ఇంటికి రాలేదు. దాంతో సోదరుడు బందువుల, స్నేహితుల వద్ద స్వాతికోసం వెతికిన ఆచూకీ లబించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

కార్పొరేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న వెంకటమ్మ కూతురు పిట్ట శ్రీదేవి (31) మతిస్థిమితం లేకపోవడంతో జనవరి 26న ఇంటినుంచి వెళ్లిపోయింది. గత నాలుగు రోజులుగా ఎంత వెతికినా ఆమె ఆచూకీ కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుమేరకు మిస్సింగ్‌కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జవహర్‌నగర్‌ పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-02-02T10:21:53+05:30 IST