ధోనీకి మోకాలి ఆపరేషన్
ABN , First Publish Date - 2023-06-02T03:50:46+05:30 IST
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మోకాలికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మోకాలికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. గురువారం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో మహీకి ఎడమ మోకాలికి కీహోల్ సర్జరీ చేశారు. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత సోమవారం అహ్మదాబాద్ నుంచి ధోనీ నేరుగా ముంబై చేరుకొన్నాడు. ప్రముఖ స్పోర్ట్స్ ఆర్థోపెడీషియన్ దిన్షా పరిఢివాల్ను సంప్రదించి సర్జరీ చేయించుకొన్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ ధ్రువీకరించారు. కాగా, ఆపరేషన్ తర్వాత మహీ డిశ్చార్జ్ అయి రాంచీ వెళ్లిపోయాడు. కొన్ని రోజులు విశ్రాంతి అనంతరం పునరావాస చికిత్స తీసుకోనున్నాడు. ఐపీఎల్ ఆసాంతం మోకాలి నొప్పితో బాధపడిన మహీ స్ర్టాప్ వేసుకొని మ్యాచ్లు ఆడాడు.