TS News: తెలంగాణ పోలీసులపై నమ్మకం లేకే సీబీఐని ఆశ్రయించా.. దుర్గం చిన్నయపై శేజల్

ABN , First Publish Date - 2023-06-12T16:32:54+05:30 IST

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై బాధితురాలు శేజల్ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా శేజల్ మీడియాతో మాట్లాడుతూ... పోలీసులకు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే మ్యానేజ్ చేస్తున్నారని ఆరోపించారు.

TS News: తెలంగాణ పోలీసులపై నమ్మకం లేకే సీబీఐని ఆశ్రయించా.. దుర్గం చిన్నయపై శేజల్

న్యూఢిల్లీ: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై (Bellampally MLA Durgam Chinnaiah) బాధితురాలు శేజల్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శేజల్ మీడియాతో మాట్లాడుతూ... పోలీసులకు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యే మ్యానేజ్ చేస్తున్నారని ఆరోపించారు. అందుకు సంబందించిన ఆధారాలను సీబీఐకి ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ పోలీసు దర్యాప్తుపై నమ్మకం లేకే సీబీఐని ఆశ్రయించినట్లు చెప్పారు. పారదర్శకంగా దర్యాప్తు చేయాలనీ సీబీఐని కోరామన్నారు. ‘‘నాపై తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్నారు. నా దగ్గర ఉన్న ఆడియో టేప్స్, ఇతర ఆధారాలను సీబీఐకి అందజేశాం. సీబీఐ దర్యాప్తు చేస్తామని చెప్పింది. రైతులను మోసం చేస్తే ఢిల్లీకి ఎందుకు వస్తాం. మోసపోయిన రైతులు ఉంటే రావాలని కోరుతున్నా ఎవరు రావడం లేదు. ఇన్వెస్ట్‌మెంట్ చేసివాళ్లకు షేర్లు ఇచ్చాము, ఎమ్మెల్యే సపోర్ట్ ఇస్తామని చెప్పినందుకే ఆయనకు షేర్ ఇచ్చాము. దుర్గం చిన్నయ్యపై కేసు నమోదై విచారణ జరిపేంత వరకు ఢిల్లీలోనే ఉంటాం. బెల్లంపల్లి లోకల్ పోలీసులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చెప్పినట్టు అనుసరిస్తున్నారు. మా పై కేసులు పెడుతున్నారు, ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారు. తెలంగాణ పోలీసులు సంప్రదిస్తే అన్ని అంశాలు వివరిస్తాను. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నాము.. వారే మాకు న్యాయం చేయాలి’’ అని బాధితురాలు శేజల్ వెల్లడించారు.

ఇప్పటికే దుర్గం చిన్నయ్యపై ఎన్‌సీడబ్ల్యూకి శేజల్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దుర్గం చిన్నయ్య అనుచరులు పదే పదే వేధిస్తున్నారంటూ కొన్నిరోజుల క్రితం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద శేజల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి శేజల్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. ఆపై ఆరోగ్యం కుదుటపడిన అనంతరం ఎన్‌సీడబ్ల్యూతో పాటు అనేక కమిషన్లను కలిసి తన బాధను వెల్లడించారు. నిన్న బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయం ఎదుట కూడా శేజల్ ధర్నా చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వల్ల ఇబ్బందులకు గురవుతున్న మహిళలకు రక్షణ కలిపించాలని, తక్షణమే ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించి, పార్టీ నుంచి తొలగించి కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో ఎమ్మెల్యేపై తెలంగాణ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి

Updated Date - 2023-06-12T16:34:29+05:30 IST