మోదీ ఆదేశాలతోనే రాహుల్పై వేటు: తమ్మినేని
ABN , First Publish Date - 2023-03-26T02:29:40+05:30 IST
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు.
హైదరాబాద్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. ప్రధాని మోదీ ఆదేశాలతోనే లోక్సభ సెక్రటేరియట్ రాహుల్పై అనర్హత వేటు వేసిందని ఆయన ఆరోపించారు. మోదీ నియంతృత్వ చర్యలతో భారత ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తీర్పుపై సూరత్ కోర్టు నెల రోజుల్లో పైకోర్టుకు వెళ్లే అవకాశమిచ్చినప్పటికీ అనర్హత వేటు వేయడం అప్రజాస్వామిక దుశ్చర్యని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.