తాటి చెట్టు నరికిన వారిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2023-07-18T02:27:20+05:30 IST

అనుమతి లేకుండా తాటి చెట్టు నరికివేసిన వ్యక్తిపై హయత్‌నగర్‌ ఎక్సైజ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

తాటి చెట్టు నరికిన వారిపై కేసు నమోదు

హయత్‌నగర్‌ : అనుమతి లేకుండా తాటి చెట్టు నరికివేసిన వ్యక్తిపై హయత్‌నగర్‌ ఎక్సైజ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. సామనగర్‌లోని సర్వేనంబర్‌ 39/39లో సాహెబ్‌నగర్‌ కల్లు సొసైటీకి చెందిన తాటి చెట్టును భూ మి పట్టాదారు అయిన నర్సింహారెడ్డి ఎలాంటి అనుమతి తీసుకోకుండా నరికి వేశాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఎక్సైజ్‌ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు సీఐ లక్ష్మణ్‌గౌడ్‌ తెలిపారు.

Updated Date - 2023-07-18T02:27:20+05:30 IST