ganja: 150 కిలోల గంజాయి స్వాధీనం
ABN , First Publish Date - 2023-01-25T09:20:42+05:30 IST
మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి రూ.
హైదరాబాద్/దుండిగల్: మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి రూ. 30 లక్షల విలువ చేసే 150 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. లూనావత్ నగేష్, నునావత్ వెంకటేష్, బానోతు చందర్, గండు అజయ్ భద్రాచలం, మణుగూరు క్రాస్రోడ్ నుంచి హైదరాబాద్ ఓఆర్ఆర్ మీదుగా మహారాష్ట్రకు కార్లలో గంజాయి తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న దుండిగల్, టాస్క్ఫోర్స్ పోలీసులు ఓఆర్ఆర్ 5వ ఎగ్జిట్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారి నుంచి 150 కిలోల గంజాయి, రెండు కార్లు, నాలుగు సెల్ఫోన్లు, రూ. 9 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు.