టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభకు 12 కమిటీలు
ABN , First Publish Date - 2023-03-26T02:30:30+05:30 IST
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ నెల 29న జరగనున్న తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించి 12 కమిటీలను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ నెల 29న జరగనున్న తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించి 12 కమిటీలను ఏర్పాటు చేశారు. శనివారం ఎన్టీఆర్ భవన్లో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ ప్రతినిధుల సభను విజయంతంగా నిర్వహించేందుకు కమిటీల ఏర్పాటుపై చర్చించారు. కమిటీల జాబితాలో ఆహ్వాన కమిటీ, సభా ప్రాంగణ అలంకరణ కమిటీ, స్టేజ్ అలంకరణ కమిటీ, నగర అలంకరణ కమిటీ, వలంటీర్ల కమిటీ, రిఫ్రె్షమెంట్ కమిటీ, జన సమీకరణ కమిటీ, సభానిర్వహణ కమిటీ, ప్రింట్-ఎలక్ర్టానిక్-సోషల్ మీడియా సంబంధాల కమిటీ, సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ, ఫొటో ప్రదర్శన కమిటీ, ప్రాంగణ పర్యవేక్షణ కమిటీ ఉన్నాయి. టీడీపీ ప్రతినిధుల సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరుకానున్నారు.