Share News

Hyderabad: ఓటు కోసం దుబాయ్‌ ప్రయాణం వాయిదా..

ABN , First Publish Date - 2023-11-29T10:58:53+05:30 IST

రాంనగర్‌లోని టీఆర్‌టీ కాలనీకి చెందిన ఓ మహిళ ఓటు వేసేందుకు దుబాయ్‌ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. టీఆర్‌టీ

Hyderabad: ఓటు కోసం దుబాయ్‌ ప్రయాణం వాయిదా..

రాంనగర్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): రాంనగర్‌లోని టీఆర్‌టీ కాలనీకి చెందిన ఓ మహిళ ఓటు వేసేందుకు దుబాయ్‌ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. టీఆర్‌టీ కాలనీకి చెందిన ఎం.ఎస్. శ్రీనివాస్‌ కుమార్తె మండల స్నేహ(Mandal Sneha) దుబాయ్‌లోని ఓ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తన కుమారుడితో నగరానికి వచ్చిన ఆమె ఈ నెల 29న దుబాయ్‌కు తిరుగుప్రయాణం కావాల్సి ఉంది. ఇందు కోసం టికెట్‌ కూడా బుక్‌ చేసుకున్నారు. ఈ నెల 30న ఎన్నికలు ఉండడంతో ఓటు వేసేందుకు తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని డిసెంబర్‌ 3న వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా మండల స్నేహ ‘ఆంధ్రజ్యోతి ప్రతినిధి’తో మాట్లాడుతూ టికెట్‌ రద్దు చేసుకున్నందుకు ఆర్థికంగా నష్టం జరిగినప్పటికీ ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ఓటు వేయడం ఆనందంగా ఉందన్నారు.

Updated Date - 2023-11-29T10:58:54+05:30 IST