TS News: మండుతున్న ఎండలు

ABN , First Publish Date - 2023-06-03T20:43:26+05:30 IST

పగటి ఉష్ణోగ్రతలు భగ్గుమంటుంటే ప్రజలు ఎండ వేడికి విలవిలలాడుతున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా (Kumuram Bheem Asifabad District) కాగజ్‌నగర్‌ మండలం..

TS News: మండుతున్న ఎండలు

ఆసిఫాబాద్‌: పగటి ఉష్ణోగ్రతలు భగ్గుమంటుంటే ప్రజలు ఎండ వేడికి విలవిలలాడుతున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా (Kumuram Bheem Asifabad District) కాగజ్‌నగర్‌ మండలం జంబుగలో శనివారం 46.1 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలలో ఇది రెండవ స్థానంలో ఉంది. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాంలో 45.7, చింతలమానేపల్లిలో 45.5, పెంచికలపేట, పెద్దపల్లి జిల్లా (Peddapalli district) పెద్దపల్లి మండలం రంగంపల్లిలో 45.1, ముత్తారంలో 45.0 సుల్తానాబాద్‌లో 44.8, ఓదెలలో 44.6, కమాన్‌పూర్‌లో 44.1, మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయిలో శనివారం 45.1, దండేపల్లి మండలం వెల్గనూరులో 44.7, చెన్నూర్‌లో 44.2, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం తనుగులలో 45.1, తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌లో 44.7, వీణవంక మండల కేంద్రంలో 44.6, జమ్మికుంట మండలం కొత్తపల్లిలో 44.3, జమ్మికుంట పట్టణంలో 44.3, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరేళ్లలో 44.4, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్తనపేటలో 44.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - 2023-06-03T20:43:26+05:30 IST