Share News

Shocking : స్వప్న హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఇదీ అసలు కథ

ABN , First Publish Date - 2023-10-29T13:50:17+05:30 IST

హైదరాబాద్‌లో చంపాపేట్‌లో శనివారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే స్వప్న అనే యువతి దారుణ హత్యకు గురైంది. సరిగ్గా ఇదే టైమ్‌లో అనంతరం ఓ యువకుడు రెండో అంతస్తు పై నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు...

Shocking : స్వప్న హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఇదీ అసలు కథ

హైదరాబాద్‌లో చంపాపేట్‌లో శనివారం రాత్రి దారుణ ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే స్వప్న అనే యువతి దారుణ హత్యకు గురైంది. సరిగ్గా ఇదే టైమ్‌లో అనంతరం ఓ యువకుడు రెండో అంతస్తు పై నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ రెండు సంఘటనలతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉలిక్కి పడింది. అసలేం జరిగింది..? స్వప్నను హత్య చేసిందెవరు..? బిల్డింగ్‌ పైనుంచి పడిందెవరు..? ఆత్మహత్యా.. హత్యా..? అనేదానిపై లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు.. ఈ కేసులో మిస్టరీని ఛేదించారు.


Swapna-S.jpg

ఇదీ జరిగింది..!

స్వప్నను హత్య చేసింది భర్త ప్రేమ్‌ అని పోలీసులు గుర్తించారు. ప్రేమ్ స్టేట్మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. వివాహేతర సంబంధం కారణంగానే స్వప్న హత్య జరిగినట్టు పోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి ప్రేమ్ ఇంటికొచ్చేసరికి ఇంట్లోనే స్వప్న, ఆమె ప్రియుడు సతీష్ ఉన్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రేమ్.. సతీష్‌తో గొడవపడ్డాడు. ఈ గొడవ కాస్త పెద్దదవ్వడంతో ఇంట్లో ఉన్న కత్తితో స్వప్నను ప్రేమ్ హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. అనంతరం ప్రేమ్‌పై దాడిచేసిన సతీష్.. బిల్డింగ్ పైనుంచి తోసేసి.. అక్కడ్నుంచి పారిపోయాడు. సతీష్ ఆచూకీ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. కాగా.. ప్రేమ్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో కోమాలో ఉన్నాడు. పెళ్లయిన తర్వాత పలుమార్లు సతీష్ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు స్థానికులు చెబుతున్న పరిస్థితి.

ఎంత నడిచిందో..!

అన్నాచెల్లెళ్లమని చెప్పి అద్దెకు దిగారు. ఇంట్లో ఎక్కువ శాతం యువతి మాత్రమే ఉండేది. అతడు ఎప్పుడో కానీ వచ్చేవాడు కాదు. ఇంతలో.. యువతికి మరో వ్యక్తితో వివాహమైంది. భర్తతో కలిసి ఉంటున్న ఆమె దారుణ హత్యకు గురైంది. భవనం పైనుంచి పడిన భర్త తీవ్ర గాయాలపాలయ్యాడు. మహబూబ్‌నగర్‌ హన్వాడ తండాకు చెందిన వర్త్య మోహన్‌ కుమార్తె స్వప్న (21), నల్లగొండ జిల్లా వాసి హన్మంతు 8 నెలల క్రితం హైదరాబాద్‌లోని ఎన్‌జీఆర్‌ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. అన్నాచెల్లెళ్లమని.. చదువు, ఉద్యోగం కోసం వచ్చినట్లు యజమానికి తెలిపారు. ఆమెకు మహేశ్వరం ప్రాంతానికి చెందిన టీ పాయింట్‌ నడిపే ప్రేమ్‌కుమార్‌ (24)తో నెల క్రితం పెళ్లయుంది. వీరు కలిసే ఉంటున్నారు.

శనివారం ఉదయం 11:30 సమయంలో రెండో అంతస్తు నుంచి ప్రేమ్‌కుమార్‌ కిందపడ్డాడు. యజమాని వచ్చి చూడగా తీవ్రంగా గాయపడి కనిపించాడు. అదే సమయంలో మెట్లు దిగి ఇద్దరు యువకులు హడావుడిగా వెళ్లిపోయారు. యజమాని పైకి వెళ్లి చూడగా స్వప్న రక్తపు మడుగులో ఉంది. ఆమెను గొంతు కోసి హత్య చేశారు. యజమాని సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి పరిశీలించారు. స్వప్న తండ్రి మోహన్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు మిస్టరీని ఛేదించారు.

Updated Date - 2023-10-29T13:50:30+05:30 IST