రోడ్డు పై ధాన్యం తొలగించిన పోలీసులు

ABN , First Publish Date - 2023-01-01T00:54:30+05:30 IST

రోడ్డుపై ధాన్యపు సంచులను చాలా రోజులుగా ఉంచి ప్రయాణికులకు ఇబ్బంది కల్గిస్తున్న ఘటనకు సంబంధించి ‘ప్రమాదమని తెలిసినా... పట్టించు కోరా’ అనే శీర్షికతో ఈ నెల 30న ఆంధ్రజ్యోతి లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే.

రోడ్డు పై ధాన్యం తొలగించిన పోలీసులు

లక్ష్మణచాంద, డిసెంబరు 31 : రోడ్డుపై ధాన్యపు సంచులను చాలా రోజులుగా ఉంచి ప్రయాణికులకు ఇబ్బంది కల్గిస్తున్న ఘటనకు సంబంధించి ‘ప్రమాదమని తెలిసినా... పట్టించు కోరా’ అనే శీర్షికతో ఈ నెల 30న ఆంధ్రజ్యోతి లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన పోలీ సులు సంబంధిత రైతులచేత ధాన్య పు సంచులను తొలగించారు. రోడ్డు పై ఎవరైనా సరే ధాన్యపు సంచులను గాని ఇతర పంటలు గాని ఆరబోసినా, టప్పీలు వేసి ఉంచి నా కఠినచర్యలు తీసుకుంటామని హె చ్చరిం చారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్సై యాకర్ల గంగాధర్‌, పోలీస్‌ కానిస్టేబుళ్లు జే.అశోక్‌ కుమార్‌, జే. గంగాధర్‌, ఎండీ వాహిద్‌ఖాన్‌, తది తరులు ఉన్నారు.

Updated Date - 2023-01-01T00:54:32+05:30 IST