బీజేపీతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది

ABN , First Publish Date - 2023-06-02T22:21:42+05:30 IST

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూన్‌ 2: పార్లమెంట్‌లో బీజేపీ మద్దతుతోనే ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌ అన్నారు. తెలంగాణ ఆవిర్భావదినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా లను ఆవిష్కరించారు.

బీజేపీతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూన్‌ 2: పార్లమెంట్‌లో బీజేపీ మద్దతుతోనే ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నామని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌ అన్నారు. తెలంగాణ ఆవిర్భావదినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా లను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మలిదశ తెలంగాణఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారులు, ఉద్యమ స్ఫూర్తితో పనిచేసిన పాత్రికేయులను శుక్రవారంపార్టీ కార్యాలయంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 1200 మందికి పైగా విద్యార్థుల ఆత్మబలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారుల కు గుర్తింపు లభించడం లేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమించి తెచ్చుకున్న తెలంగాణలో కుటుంబపాలన సాగుతోందన్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. తెలంగాణ కోసం అమరులైన అమరవీరుల కుటుం బాలను మరిచిపోయి తన సొంత కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చారన్నారు. కార్యక్రమంలోనాయకులు మురళీధర్‌,ఆత్మారాం, సత్యనారా యణ, జయరాజ్‌, శ్రీశైలం, చక్రపాణి, లక్ష్మి, శ్రీనివాస్‌, సుచిత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T22:21:42+05:30 IST