ఎంపీల సస్పెన్షన్ను ఎత్తివేయాలి
ABN , Publish Date - Dec 22 , 2023 | 10:38 PM
పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో నిరసన చేపట్టారు.
ఏసీసీ, డిసెంబరు 22: పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రతిపక్ష ఎంపీలందరినీ సస్పెండ్ చేయడం తగదన్నారు. ప్రతిపక్షాలను సభలో లేకుండా చేసి వారికి కావాల్సిన బిల్లులను పాస్ చేయించే కుట్రలో భాగంగా అక్రమ సస్పెన్షన్లకు పాల్పడ్డారని విమ ర్శించారు. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాం డ్ చేశారు. నాయకులు చిట్ల సత్యనారాయణ, తూ ముల నరేష్, పెంట రజిత, హేమలత పాల్గొన్నారు.
లక్షెట్టిపేటరూరల్: కేంద్ర ప్రభుత్వం విధించిన 141 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయా లని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశో క్, పట్టణాధ్యక్షుడు ఎండీ ఆరీఫ్లు డిమాండ్ చేశా రు. శుక్రవారం ఉత్కూరు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన దీక్ష చేపట్టారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంటనే ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, స్వామి, సుమ న్, ముఖరంజా, వెంకన్న, సతీష్ , రంజిత్ సింగ్, విజయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.