Share News

శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలి

ABN , Publish Date - Dec 17 , 2023 | 10:28 PM

శాంతి భద్రతల విష యంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని బెల్లంపల్లి ఏసీపీ సదయ్య సూచించారు. ఆదివారం తాళ్లగురిజాల పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను పరిశీలిం చారు.

శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలి

బెల్లంపల్లి, డిసెంబరు 17: శాంతి భద్రతల విష యంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని బెల్లంపల్లి ఏసీపీ సదయ్య సూచించారు. ఆదివారం తాళ్లగురిజాల పోలీస్‌స్టేషన్‌ పరిసరాలను పరిశీలిం చారు. పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు, సిబ్బంది నిర్వ హిస్తున్న విధులను తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన కేసుల వివరాలను పరిశీలించి పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాల ని సూచించారు. ఏసీపీ మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్‌లో 5ఎస్‌ ఫంక్షన్‌ వర్టికల్స్‌ అయ్యేలా చూసుకో వాలన్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, వారికి తగిన న్యాయం చేయాల న్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించవద్దని సూచించారు. పోలీసుల విధి నిర్వ హణలో అప్రమత్తంగా ఉండాలని, బాధ్యయుతంగా విధులు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. బెల్లంపల్లి రూరల్‌ సీఐ రాజ్‌ కుమా ర్‌గౌడ్‌, ఎస్‌ఐ నరేష్‌, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 10:28 PM