Share News

ముగిసిన రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలు

ABN , First Publish Date - 2023-12-10T22:10:23+05:30 IST

భీమారం మండల కేంద్రంలోని జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్‌ 14 హ్యాండ్‌బాల్‌ బాలికలు, బాలుర పోటీలు ఆదివారం ముగిశాయి.

ముగిసిన రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలు

భీమారం, డిసెంబరు 10 : భీమారం మండల కేంద్రంలోని జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్‌ 14 హ్యాండ్‌బాల్‌ బాలికలు, బాలుర పోటీలు ఆదివారం ముగిశాయి. ఫైనల్‌ పోటీల్లో బాలికల విభాగంలో ఆదిలాబాద్‌-వరంగల్‌ జట్లు తలపడగా ఆదిలాబాద్‌ జట్టు విజయం సాధించింది. అలాగే బాలుర విభాగంలో వరంగల్‌ -కరీంనగర్‌ జట్లు తలపడగా వరంగల్‌ జట్టు విజయం సాధించింది. తృతీయ స్ధానంలో బాలికల విభాగంలో కరీంనగర్‌, బాలుర విభాగంలో రంగారెడ్డి జట్లు నిలిచాయి. విజేతలకు బహుమతులతోపాటు మెరిట్‌, పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్‌లు, మెడల్స్‌ అందించారు. కాగా ఈ పోటీల్లో ఉమ్మడి పది జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సర్పంచు గద్దె రాంరెడ్డి, హెడ్మాస్టర్‌ విక్రమ్‌, టీఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ పరిమిళ, ప్రెసిడెంట్‌ గోపాల్‌, జనరల్‌ సెక్రటరీ శ్రీనివాస్‌, సదానందం, పీఈటీ విఠల్‌, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T22:10:24+05:30 IST