ఆకట్టుకొన్న సీతారాముల శోభాయాత్ర
ABN , First Publish Date - 2023-03-30T22:36:55+05:30 IST
మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో సీతారాముల విగ్రహలను గురువారం రాత్రి శోభాయాత్ర నిర్వహించారు. రామాలయం, ఆంజనేయస్వామి దేవాలయాల్లోని సీతారామచంద్ర స్వాము ల వారిని పలువీధుల గుండా ఉరేగింపు నిర్వహించారు.
దండేపల్లి, మార్చి 30 : మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో సీతారాముల విగ్రహలను గురువారం రాత్రి శోభాయాత్ర నిర్వహించారు. రామాలయం, ఆంజనేయస్వామి దేవాలయాల్లోని సీతారామచంద్ర స్వాము ల వారిని పలువీధుల గుండా ఉరేగింపు నిర్వహించారు. మహిళలు మంగళ హారతితో స్వాగతం పలికారు. శోభాయాత్రలో రామనామ సంకీర్తనలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. ఎస్సై సాంబమూర్తి పాల్గొన్నారు.
భీమారం: శ్రీరాముని విగ్రహంతో మండల కేంద్రంలోని కోదండరామాల యం నుంచి ఆయా వార్డుల్లో హనుమాన్ స్వాములు శోభాయాత్ర నిర్వ హించారు. మహిళలు, గ్రామస్తులు స్వాగతం పలికారు.