రెండో ఏఎన్ఎంలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
ABN , First Publish Date - 2023-01-17T22:14:50+05:30 IST
ఆసిఫాబాద్, జనవరి 17: రెండో ఏఎన్ఎంలను జీవో16లో చేర్పించి ప్రభుత్వఉద్యోగులుగా గుర్తిం చాలని మంగళవారం జిల్లాఆస్పత్రి ఎదుట ఏఎన్ఎంలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ రాష్ట్రంలో 15 సంవత్సరాల నుంచి చాలీచాలని వేత నాలతో పనిచేస్తున్నామన్నారు.
ఆసిఫాబాద్, జనవరి 17: రెండో ఏఎన్ఎంలను జీవో16లో చేర్పించి ప్రభుత్వఉద్యోగులుగా గుర్తిం చాలని మంగళవారం జిల్లాఆస్పత్రి ఎదుట ఏఎన్ఎంలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ రాష్ట్రంలో 15 సంవత్సరాల నుంచి చాలీచాలని వేత నాలతో పనిచేస్తున్నామన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేశామన్నారు. అనం తరం డీఎంహెచ్వో ప్రభాకర్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీ యూసీ నాయకులు ఉపేందర్, శంకర్, ఏఎన్ఎంలు పుణ్యబాయి, భాగ్యలక్ష్మి, సునీత తదితరులు పాల్గొన్నారు.